సమాజంలో పాత్రికేయుల పాత్ర కీలకం-బలరాం జాదవ్.
నేరడిగొండఆగస్టు25(జనంసాక్షి): మండలంలో పాత్రికేయుల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా కొప్పుల ప్రమోద్,గౌరవ అధ్యక్షులుగా ఫషియోద్దీన్ ఉపాధ్యక్షులుగా ఏలేటి సృజన్ రెడ్డి ప్రధాన కార్యదర్శిగా జాదవ్ రామారావ్,కోశాధికారి పోతన్న సంయుక్త కార్యదర్శి అజయ్ సలహాదారులు షేక్ అజార్ గౌరవ సలహాదారులు దేవేందర్ సలహా సభ్యులు మదన్ సింగ్ కార్యదర్శి గంగయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.సభ్యులుగా రవి రాథోడ్ నారాయణ శోభన్ రెడ్డి ఆశోక్ లు ఎన్నికయ్యారు. గురువారం రోజున వీరిని తెలంగాణరాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ ఘనంగా శాలువాలతోసన్మానించారు.బలరాం మాట్లాడుతూ పత్రికా పాత్రికేయుల పాత్ర సమాజంలో కీలక పాత్ర పోషిస్తుందని, సమాజాన్ని అభివృద్ధి వైపు అడుగులేసేలా వారి వార్తలు ఉంటాయని అన్నారు.సన్మాన కార్యక్రమంలో జూనియర్ కాలేజ్ అధ్యాపకులు మండల సోషల్ మీడియాకార్యదర్శి సాబ్లే సంతోష్ మీడియా మిత్రులు తదితరులు పాల్గొన్నారు.