సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు….

చిలప్ చేడ్/18ఆగస్టు/జనంసాక్షి :- మండలంలో ఘనంగా సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలను మండలంలోని గౌడన్నలు అందరు ఏకమై సర్వాయి పాపన్న చిత్ర పటానికి పూలమాలలు వేసి వారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ సర్వాయి పాపన్న భువనగిరి కోట నుండి గోల్కొండ కోట వరకు పోరాటం చేసి గోల్కొండ కోట పై జెండా ఎగరవేయడం జరిగింది.అన్ని కులాలను ఏకం చేసి,బహుజన వాదిగా పేరు పొందినటువంటి సర్దార్ సర్వాయి పాపన్నను స్మరించుకోవడం జరిగింది.తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని జరపడం సంతోషకరంగా ఉందన్ని వారు అన్నారు ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షులు వినోద రెడ్డి గారు మరియు డిప్యూటీ తాసిల్దార్ ఆదర్శ్ ,మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ గౌడ్,యూత్ ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్,ముకుంద రెడ్డి,కృష్ణ గౌడ్,రమేష్ గౌడ్,శేఖర్ గౌడ్,యాద గౌడ్,రామాగౌడ్,లింగం గౌడ్,గోకాని కృష్ణ గౌడ్,నవాజ్ గౌడ్,శివగౌడ్, పోచ గౌడ్,అర్జున్ గౌడ్,శ్రీనివాస్ గౌడ్,సంపత్ గౌడ్,సంతోష్ గౌడ్,వేణు గౌడ్, విట్టల్ గౌడ్,ఈశ్వర్ గౌడ్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు