సర్పంచ్ ను అడ్డుకున్న యువకులు

పానుగల్ అక్టోబర్12, జనంసాక్షి
గ్రామానికి బస్సు రావడంలేదని, గ్రామ యువకులు కలిసి సర్పంచ్ ను అడ్డుకున్న సంఘటన బుధవారం కదిరేపాడు గ్రామంలో చోటుచేసుకుంది. మండల పరిధిలోని కదిరపాడు గ్రామానికి గత కొన్ని రోజులుగా ఆర్టీసీ బస్సు సర్వీస్ ను నిలిపివేశారు. దీంతో కళాశాలకు వెళ్లే విద్యార్థులకు మరియు రైతులు వివిధ పనుల మీద మండల కేంద్రానికి చేరుకోవలన్న చాలా ఇబ్బందులు పడవలసి వస్తుందని, అనారోగ్యం పాలైన వ్యక్తులు చికిత్స చేయించుకోవడానికి ఆసుపత్రికి చేరుకోవాలన్న నరక యాతన అనుభవిస్తున్నామని, గ్రామ యువకులంతా కలిసి, అటుగా వస్తున్న సర్పంచ్ విభూతి లక్ష్మయ్యను అడ్డుకున్నారు. ఇప్పటికైనా బస్ సర్వీస్ ను పునరుద్ధరించాలని కోరారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఈ విషయంపై వనపర్తి డిపో మేనేజర్ ను కలవడం జరిగిందని, కలెక్షన్లు రావడంలేదని, బస్ సర్వీస్ ను నిలిపివేశామని అధికారులు తెలిపారన్నారు. ప్రజలు రవాణా సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నందున తక్షణమే బస్సు సౌకర్యం కల్పించాలని గ్రామ ప్రజలు కోరారు.