సర్పంచ్ పై కొయ్యూరు పోలీసులకు ఫిర్యాదు చేసిన వార్డు సభ్యుడు
మల్హర్, జనంసాక్షి
మండల కేంద్రమైన తాడిచర్ల మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచి సుంకరి సత్యనారాయణ పై కొయ్యూరు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా తాడిచర్ల 12 వార్డు సభ్యుడు కుంట సదానందం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వారు మాట్లాడుతూ ఉదయం వార్డులోని పలు సమస్యలను పంచాయతీ కార్యదర్శి కి విన్నవించుకునేందుకు పంచాయతీ కార్యాలయానికి వెళ్లిన క్రమంలో నాపై సర్పంచి సత్యనారాయణ మద్యం సేవించి ఇష్టానుసారంగా దుర్బాషలాడుతు కుర్చీని క్రింద పడేసి బూతులు తిట్టాడాని వార్డు సభ్యుడు కుంట సదానందం వాపోయాడు. సర్పంచి పై చర్యల కై కొయ్యూరు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు.