సర్పంచ్ పోరామ్ అధ్యక్షుడిగా రవి కిరణ్

జహీరాబాద్ ఆగస్టు 11 (జనంసాక్షి) కోహిర్  మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా జే రవికిరణ్ ఎన్నుకొన్నారు. గురువారం మండల కేంద్రంలోని కోహిర్లో  సర్పంచుల సమక్షంలో ఈ ఎన్నిక జరిగింది. సర్పంచ్ పొరామ్ అధ్యక్షుడిగా పీచరాగడి సర్పంచ్ రవి కిరణ్ ఉపాధ్యక్షుడిగా బిలాల్పూర్ సర్పంచ్ నర్సింహులను ఎన్నుకొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, ఉపాధ్యక్షులకు సభ్యులు శాలువ పులమలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు అతియా జావీద్, మొల్లయ్య, వెంకట్రాంరెడ్డి,రమేశ్, పులమ్మ, సంగారెడ్డి,కిష్టయ్య,సిద్దప్ప, నర్సింలు, తారాబాయ్, తుక్కప్ప తదితరులు పాల్గొన్నారు.