సామాజిక బాధ్యతలో బ్రహ్మకుమారీల సేవ అమోఘం
ఖమ్మం,జూలై28(జనం సాక్షి): నేటి సమాజంలో ఆధ్యాత్మిక సామాజిక క్రాంతి నింపే బాధ్యత అందరిపై ఉందని, నవయుగం రావాలంటే యువతరం మేల్కొనాలని ఖమ్మం ఎమ్మెల్యే శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ప్రపంచ మహాపరివర్తనంలో మానవాళి విలువలను చైతన్యపరిచేందుకు బ్రహ్మకుమారి సంస్థ ఆధ్వర్యంలో దేశం మొత్తం తిరుగుతున్న అఖిలభారత యువ బస్సుయాత్రను ఖమ్మం ప్రారంభించారు. కస్భాబజార్ రోడ్ లోని ప్రజాపిత బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వ విద్యాలయం వద్ద ఖమ్మం ఎమ్మెల్యే దంపతులు పువ్వాడ అజయ్ కుమార్ , శ్రీమతి వసంత లక్ష్మి దీనిని ప్రారంభించారు.