సాయంత్రం రాజీనామా ఇవ్వనున్న శెట్టర్‌

బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి జగదీశ్‌ శెట్టర్‌ ఈరోజు సాయంత్రం 6.30 గంటలకు గవర్నర్‌కు రాజీనామా పత్రం సమర్పించనున్నారు. ఇవాళ వెలువడిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భాజపా పరాజయం పాలైన సంగతి తెలిసిందే