సాయిరాం నగర్ లో నగర సంకీర్తన కార్యక్రమం

జహీరాబాద్ ఆగస్టు 14 (జనంసాక్షి )జహీరాబాద్ పట్టణం లోనిమన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75సంవత్సరాలు అవుతున్న సందర్భంగా దేశ వ్యాప్తంగా ఆజాది కా అమృత్ మహోత్సవం ( భారత స్వాతంత్ర్య వజ్రోస్తవ) వేడుకలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ తమ దైన శైలిలో దేశభక్తి చాటుకుంటున్నారు.ఇందులో భాగంగా ఆదివారం నగర సంకీర్తన కార్యక్రమంను జహీరాబాద్ పట్టణం లోని సాయిరాం కాలనీ లో జాతీయ జెండా లతో పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో విశేషం.పట్టణంలోని సాయిరాం నగర్ లోని ఎల్లమ్మ దేవాలయం నుండి ఈ నగర సంకీర్తన కార్యక్రమాన్ని ప్రారంభించి చుట్టుప్రక్కల కాలనీ లలో పర్యటించారు. ఈ సందర్భంగా దేశ భక్తి గీతాలు,అధ్యాత్మిక గీతాలు ఆలపిస్తు నగర సంకీర్తలన సభ్యులు పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణం లోని పలు కాలనీ లకు చెందినమహిళలు, ప్రజలు పాల్గొన్నారు..