సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

 లింగాల జనం సాక్షి :
నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలంలోని కొత్తకుంటపల్లి గ్రామంలో ప్రభుత్వ విఫ్,అచ్చంపేట శాశనసభ్యులు గువ్వల బాలరాజు ఆదేశాల మేరకు  సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు సోమవారం గ్రామ సర్పంచ్ సౌడమొని పర్వతాలు,ఉప సర్పంచ్ కురుమయ్య ఆధ్వర్యంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజలు ఆపదలో ఉన్నపుడు వారిని ఆదుకొనాలే అనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కేసిఆర్ సిఎం రిలీఫ్ ఫండ్ ను తీసుకొచ్చారని,పేద ప్రజల పెన్నిధి కేసిఆర్ అని కొనియాడారు.సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పొందిన వారిలో చెన్నమ్మ,సరిత,జైనభీ తదితర లబ్దిదారులు ఉన్నట్లు వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు శ్రీను,అర్జున్,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.