సిపిఐ ఆధ్వర్యంలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

టేకులపల్లి, ఆగస్టు 15( జనం సాక్షి): 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో టేకులపల్లి మండల కేంద్రంలో సిపిఐ కార్యాలయం నందు జాతీయ జెండాను సిపిఐ పార్టీ జిల్లా నాయకులు గుగులోతు రామచందర్ ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో గుగులోతు శ్రీను, ఎజ్జు భాస్కర్, బానోతు వీరన్న, అయిత శ్రీరాములు, వాసం భద్రయ్య, తేజాతు లక్ష్మణ్, బండి వీరభద్రం, ఇస్లావత్తు రవీందర్, తేజావత్తు మధు ,లాకావత్ లచ్చు, గుగులోతు సోనీ అవంతిక తదితరులు పాల్గొన్నారు.