సిపిఐ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిగా పని చేయాలి. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి.సుధాకర్.

కోటగిరి జూలై 21 జనం సాక్షి:-కోటగిరి మండల సి.పి.ఐ(భారత కమ్యూనిస్టు పార్టీ) మహాసభను మండల కేంద్రంలోని గీతా పారిశ్రామిక సహకార సంఘంలో శుక్రవారం రోజున నిర్వహించారు.ఈ సందర్భంగా పార్టీ జెండాను సిపిఐ జిల్లా  నాయకులు వై ఓమయ్య జెండా ఆవిష్కరణ చేశారు.అనంతరం జరిగిన మహాసభ కు ఏ.విఠల్ గౌడ్ అధ్యక్షత వహించారు.మహా సభకు ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి సుధాకర్ మాట్లాడుతూ.భారత కమ్యూనిస్టు పార్టీ నాడు దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని పోరాటం చేసి,ప్రస్తుతం ప్రజా కార్మిక సమస్యల కోసం రాజీలేని పోరాటాలు చేస్తున్నామని.అలాగే పార్టీ ప్రజా సంఘాల బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు.అదేవిధంగా సిపిఐ బాన్సువాడ నియోజక వర్గం ఇంచార్జ్ రాములు మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను పక్కనపెట్టి ప్రజలను పక్కదారి పట్టిస్తు న్నారని.ఇప్పటికే జీఎస్టీ పేరుతో కేంద్ర ప్రభుత్వం దోచుకుంటుంటే కాళేశ్వరం, ఇతర కాంటాక్ట్ ల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కొరకు అమలు చేయాల్సిన నిధులన్నీ పక్కదారి పట్టిస్తున్నారని అన్నారు.ఇప్పటికైనా టిఆర్ఎస్ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇస్తానన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, 55 సం.లు ఉన్న వారందరికీ పెన్షన్లు ఇవ్వాలని, రైతాంగం పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ మహాసభలో సిపిఐ మండల నాయకులు నల్ల గంగాధర్,నీలి దత్తు,సోమ రాములు,బర్ల సునీల్ కుమార్, మల్లేష్,నీలి శంకర్,గోపాల్, ఎస్.కె యాసిన్,ఫారుక్, తదితరులు పాల్గొన్నారు
.