సి పీ ఎస్ ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దించాలని ఎమ్మార్వో కు వినతి పత్రం

మల్లాపూర్,(జనం సాక్షి ) సెప్టెంబర్: 01 మండలంలోని ఈరోజు పి ఆర్ టి యు టి ఎస్ రాష్ట్ర, జిల్లా శాఖ పిలుపు మేరకు సెప్టెంబర్ 1వతేదిని పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ పి ఆర్.టి యుటిఎస్ మల్లాపూర్ మండల శాఖ ఆధ్వర్యంలో మండలంలోని అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు.. సిపిఎస్ ను రద్దు చేసి పాతపెన్షన్ ని పునరుద్ధరించాలని మండల శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎనగందుల శ్రీనివాస్, జక్కుల నవీన్ కుమార్ డిమాండ్ చేశారు.
ఉపాధ్యాయ బృందంతో మల్లాపూర్ మండల తహశీల్దార్ ఆఫీస్ కి ర్యాలీగా వెళ్లి తహశీల్దార్ కు వినతి పత్రం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి లక్కడి శ్రీనివాస్ రెడ్డి, నర్సింగరావు‌, సుధాకర్, చంద్రప్రకాష్, రాధ, హరినాథ్, దామోదర్, అజీమ్, నరేష్, నర్సింహరెడ్డి, మహేష్, విజయ్, నరేంధర్, మల్లేశం, సంతోష్, ప్రవీణ్, చారి, మైసయ్య తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు..