*సి.యం.ఆర్ ఎఫ్ చెక్కులు అందించిన BRS మండల పార్టీ అధ్యక్షుడు సిందే రామోజీ*

కొడకండ్ల, అక్టోబర్22( జనంసాక్షి)
తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి & ఆర్ డబ్ల్యూ ఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సహకారంతో మంజూరు అయిన చెక్కులను కొడకండ్ల మండలంలోని  రామన్నగూడెం గ్రామనికిచెందిననలుగురులబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను  అందిచిన బి ఆర్ యస్ మండల పార్టీ అధ్యక్షుడురామోజీ.అనంతరం మాట్లాడుతూ నిరుపేదల ఆరోగ్యానికి అండగా నిలుస్తూ వారి ఆర్థిక స్వాలంభనే లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది, ఆపదలో ఉన్న అభాగ్యులకు అండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక భరోసా కల్పిస్తోంది,ప్రజల సంక్షేమం తెలంగాణ సర్కారు నినాదం అని తెలిపారు.లబ్ధిదారులు
బక్కయ్యా,మహేందర్, శోభా,
లచ్చయ్య లకు చెక్కులను  ఇంటికి వెళ్లి  చెక్కులు అందిజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో
స్థానిక సర్పంచ్ లింగయ్య,ఎంపీటీసీ కుంసోత్ యాదమ్మ,జిల్లా రైతుబంధు సభ్యులు భారత్ శ్రీనివాస్, ఏ యం సి డైరెక్టర్ శీలం ఎల్లప్ప,మండల రైతు విభాగం అధ్యక్షుడు యాదగిరి,మండల యూత్ అధ్యక్షుడు దేశగాని సతిష్,
  గ్రామపార్టీ అధ్యక్షుడు మేకల రమేష్, ఉప్పసర్పచ్ యట వెంకన్న,సీనియర్ నాయకులు కుంసోత్ బాబునాయక్ , వార్డుమేబర్స్  యాకు, కోప్సన్ మేబర్ సోముల, పార్టీ నాయకులు ,గ్రామా ప్రజలు తదితరులు పాల్గొన్నారు.