సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి

పాను గల్,ఆగస్టు 28( జనం సాక్షి)
మండలం పరిధిలోని షాగాపూర్ గ్రామానికి మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను శనివారం రోజు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి బాధిత కుటుంబాలకు అందజేశారు. గ్రామానికి చెందిన తెలుగు అలివేందుకు16,000/- వంగూరి సుదర్శన్ కు 24,000/- మంగ దొడ్డి సుదర్శన్ కు 36,000/-మరియు తెలుగు అలివేందుకు20,500/- ముంత మహేశ్వర్ కి22,000/- రూపాయలు(1,18,500/-) మొత్తం రూపాయలు శాఖాపూర్ గ్రామం కు చెందిన నిరుపేదలకు చెక్కులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్ గారికి,అడిగిన వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి చెక్కులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి మరియు ఎంపీపీ శ్రీధర్ రెడ్డి, జడ్పిటిసి లక్ష్మీ చంద్రశేఖర్ నాయక్, మండల పార్టీ అధ్యక్షులు రాము యాదవ్, టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు అడ్వకేట్ రవికుమార్, రైతుబంధు సమితి మండల అధ్యక్షులు వెంకటయ్య నాయుడు, కొల్లాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సోమనాథ్ నాయక్, మరియు చెక్కులు రావడానికి సహకరించిన ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షులు సుబ్బయ్యయాదవ్ మండల కో ఆప్షన్ అలీమ్ పాషాలకు చెక్కుల అందుకున్న బాధిత కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.