సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మేడిపల్లి గ్రామ ఆసరా లబ్ధిదారులు

రంగారెడ్డి ఇబ్రహీంపట్నం (జనం సాక్షి):-
తెలంగాణ ప్రభుత్వం నూతనంగా అర్హులైన వారికి ఆసరా పింఛన్లు మంజూరు చేయడం వల్ల

లబ్దిదారులు యాచారం మండలం మేడిపల్లి నక్కర్త గ్రామ పంచాయతీ ఆవరణలో  సీఎం  కేసీఆర్  చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది.
ఈకార్యక్రమంలో సర్పంచ్ చిగురంత శ్రీనివాస్ రెడ్డి , ఉపసర్పంచ్ అలంపల్లి సత్తమ్మ కృష్ణ, ఎంపీటీసీ మొరుగు శివలీల రమేష్, సహకార సంఘం డైరెక్టర్ మక్కపల్లి స్వరూప శ్రీనివాస్ వార్డు సభ్యులు దెంది సురేందర్ రెడ్డి, మరియు గ్రామ తెరాస అధ్యక్షుడు వడ్డేమోని కిషన్ మరియు  యువత అమీర్,ప్రవీణ్, రమేష్, మరియు గ్రామ లబ్దిదారులు పాల్గొన్నారు.