సీఎం సహాయనిది చెక్కుల పంపిణీ
దౌల్తాబాద్ ఆగష్టు 24, జనం సాక్షి.
పేద ప్రజలకు అండగా సీఎం కెసిఆర్ నిలుస్తున్నారని తిరుమలాపూర్ సర్పంచ్ భాగ్య ఎల్లం,ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు బండారు దేవేందర్ పేర్కొన్నారు . ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్,మంత్రి హరీష్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణలో వైద్యానికి పెద్దపీట వేస్తున్నారని,జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ వైద్యం కొనసాగుతుండగా అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేటు వైద్యం చేయించుకున్న వారికి సైతం సీఎం సహాయనిధి ద్వారా ఆదుకోవడం జరుగుతుందన్నారు.ముఖ్యమంత్రి సహయ నిధి చెక్కులను
తిరుమలాపూర్ గ్రామానికీ చెందిన యాకటి పద్మకు 58,000 వేల రూపాయలు, వెంకన్న గారి భారతమ్మకు 48,000 వేల రూపాయలు, నీరుడు సులోచనకు 10,000/ రూపాయలు, జంగయ్యల్ల రాణి 60,0000/ రూపాయలు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు రమేష్ గౌడ్, బీసీ సెల్ అధ్యక్షుడు గడ్డం నాగరాజు, పార్టీ కార్యకర్తలు గడ్డమీద సత్తయ్య, నర్సింలు, సాయిలు ,అంజయ్య, నరేష్, మల్లయ్య ,బాలయ్య ,నరసింగరావు తదితరులు పాల్గొన్నారు.
