సీఎం సహాయనిధి పేదలకు వరం.
దౌల్తాబాద్ ఆగష్టు 20, జనం సాక్షి.
పేద ప్రజలకు అండగా సీఎం కెసిఆర్ నిలుస్తున్నారని దౌల్తాబాద్ తెరాస మండల అధ్యక్షులు రణం శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు . ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్,మంత్రి హరీష్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణలో వైద్యానికి పెద్దపీట వేస్తున్నారని,జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ వైద్యం కొనసాగుతుండగా అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేటు వైద్యం చేయించుకున్న వారికి సైతం సీఎం సహాయనిధి ద్వారా ఆదుకోవడం జరుగుతుందన్నారు.ముఖ్యమంత్రి సహయ నిధి చెక్కులను లక్ష్మణ్ గౌడ్ 16000,
మహేష్ గౌడ్ 15000,వసంత 27000,లచ్చయ్య 32000, నర్సింలు 30000, లక్ష్మీ నరసవ్వ 26000,చందర్ రావు 71000 రూపాయల చెక్కులను అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రహీముద్దీన్,వైస్ ఎంపీపీ అల్లి శేఖర్ రెడ్డి,సర్పంచు చిత్తారి గౌడ్, దౌల్తాబాద్ ఉప సర్పంచ్ ముత్యంగారి యాదగిరి, తెరాస నాయకులు జనార్దన్ రెడ్డి,నాగరాజుగౌడ్, నాగరాజు,ఇమానియల్,రత్నం తదితరులు పాల్గొన్నారు.
]
