సీఎం సహాయ నీది చెక్కు అందజేసినా ఎమ్మెల్యే అబ్రహం

అలంపూర్ జూలై 27(జనంసాక్షి ): అలంపూర్ నియోజకవర్గం లోని ఉండవల్లి మండలం ఇటిక్యాల పాడు గ్రామానికి చెందిన ఎద్దుల మోహన్ రెడ్డి కి సీఎం సహాయ నీది ద్వార మంజూరు అయిన 1 లక్ష రూపాయల చెక్కును గురువారం నేరుగా లబ్ధిదారుని ఇంటికి వెళ్లి అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం చెక్కును అందజేశారు.ఈసందర్బంగా ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతూ,సీఎం సహాయ నిది నిరుపేదలకు ఒక్క గొప్ప వరమని, అనేకమంది పేద ప్రజలు డబ్బులు లేక ఆస్పత్రుల్లో ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది, కానీ రాష్ట్ర ప్రభుత్వం వారిని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద పేద ప్రజల ప్రాణాలను రక్షిస్తుంది అన్నారు.
అలంపూర్ నియోజకవర్గంలో ఎంతో మంది పేద ,మధ్య తరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి వరంగా మారిందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం అధ్యక్షుడు లోకేశ్వర్ రెడ్డి ,నరసింహ ,బీసీ సెల్ అధ్యక్షుడు కృష్ణ గౌడ్ ,మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.