సీబీఐ కోర్టుకు గైర్హాజరైన శ్రీలక్ష్మి

హైదరాబాద్‌, జనంసాక్షి: ఓఎంసీ కేసులో నిందితురాలు , ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మి కోర్టుకు హాజరు కాలేదు. ఈ కేసులో ఇవాళ ఆమె కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. కానీ అనారోగ్యం కారణంగా తాను కోర్టుకు హాజరుకాలేక పోతున్నానని ఆమె తన న్యాయవాది ద్వారా కోర్టుకు తెలియజేశారు. ఈ మేరకు ఆమె తరపున న్యాయవాది కోర్టుకు డిస్పెన్స్‌ మెయో దాఖలు చేశారు.