సీ.ఎం.రిలీఫ్ ఫండ్ తో ఎంతో మంది పేదలకు లబ్ది.. సుదీర్ రె

పేదల ఆరోగ్య పరిరక్షణకు సీ.యం.సహాయనిధి దోహదపడుతుంది అని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు .చంపాపేట  డివిజన్ పరిధిలోని ఉదయ్ నగర్ కాలనీకు చెందిన నాగరాజు   నోటి కాన్సర్ కు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న నేపథ్యంలో వారు హాస్పిటల్ నందు చేరిక కావడం జరిగింది.చికిత్స అనంతరం వారు హాస్పిటల్ నుండి డిశ్చార్జి కావడం జరిగింది.అయితే వారి యొక్క ఆర్థిక స్థితులు బాగలేక వారు వారి యొక్క కుటుంబసభ్యులు హాస్పిటల్ బిల్లులతో ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుదీర్ రెడ్డి ని  సంప్రదించారు.వెంటనే స్పందించిన సుదీర్ రెడ్డి  అట్టి ఆపరేషన్ కు అయిన బిల్లులను ముఖ్యమంత్రి సహాయనిదికి దరఖాస్తు చేయడం జరిగింది.దానికి గాను వారికి 2,00,000(రెండు లక్షల రూపాయలు) చెక్కు మంజూరు చెక్కులు బాధితునికి అందజేయడం  జరిగింది.ఈ సందర్భంగా సుదీర్ రెడ్డి  మాట్లాడుతూ  ఈ పథకం పేదలకు ఓ వరం లాంటిది అని అన్నారు.పేద ప్రజలకు నాణ్యమైన అధునాతన వైద్య సేవలను పొందేందుకు సీ.ఎం.సహాయనిది అండగా ఉంటుంది అని అన్నారు.ఎల్.బి.నగర్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం పనిచేస్తాను అని తెలిపారు.ఇ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బి.సీ.సంఘం నాయకులు ఓరుగంటి.వెంకటేశం గౌడ్,హస్తినపురం డివిజన్ తెరాస పార్టీ అధ్యక్షులు
సత్యం చారి,అమరేందర్ సాగర్  పాల్గొన్నారు.