సేంద్రియ ఎరువులతో అధిక దిగుబడులు

ఝరాసంగం జులై 28 (జనంసాక్షి) సేంద్రియ ఎరువులతో అధిక దిగుబడులు సాధించవచ్చు అని వ్యవసాయ శాస్త్రవేత్త రమేష్ అన్నారు. ఝారసంగం మండలం లోని ఎల్గొయ్, పొట్ పల్లీ గ్రామాలలో కందిలో సామూహిక ప్రథమ శ్రేణి ప్రదర్శనా క్షేత్రాలపై రైతు శిక్షణ కార్యక్రమం, ప్రదర్శనలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వి రమేష్ పంటల యాజమాన్యం శాస్త్రవేత్త మాట్లాడుతూ కంది పంట 35-45 రోజుల్లో ఉంది. అధిక వర్షాల వల్ల పంటల ఎదుగుదల తక్కువగా ఉంది అన్నారు.ఈ సమయం లో పంటకు పై పాటుగా 200 లీటర్ నీటిలో 10 లీటర్ల ద్రవ జీవామృతం కంది పంటపై పిచికారి చేయాలి అన్నారు. దానితో పాటు కంది లో ఎండు తెగులు సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందువలన ట్రై కోడెర్మా విరిడి 200 లీటర్ నీటిలో 1 కిలో వేసి మొక్క మొదలకు భూమి తడిచెలగ వేయాలి అని అన్నారు. ఎన్. స్నేహా లత సస్య రక్షణ శాస్త్రవేత్త మాట్లాడుతూ అధిక వర్షాల వల్ల వివిధ పంటలో వచ్చే పురుగులు తెగుళ్ళ నివారణకు గురించి వివరించారు. ఈ.స్వామి మృతిక శాస్త్ర నిపుణులు మాట్లాడుతూ వర్మీ వాష్ తయారి మరియు ఉపయోగించే విధానం గురించి వివరించారు. అనంతరం 50మంది రైతులకు ట్రైకో డెర్మా పంపిణి చేసి అదే ఎలా వాడాలో వివరించారు. ఈ కార్యక్రమంలో డీడీ ఏస్ సూపర్ వైజర్ల్ బాలన్న, కేసమ్మ, వినయ్ కుమార్, మహిళా రైతులు పాల్గొన్నారు.