**సోనియాగాంధీ పై ఈడి కేసులకు నిరసనగా మోడీ దిష్టిబొమ్మ దహనం*

    కాంగ్రెస్ పార్టీ నాయకులు రంగినేని అభిలాష్ రావు

వీపనగండ్ల 22 (జనంసాక్షి) కేంద్రంలో  శ్రీమతి సోనియా గాంధీ మీద నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో కుంభకోణం జరిగిందని కక్ష పూరితంగా బీజేపీ ప్రభుత్వం చేయిస్తున్న ఈ.డీ దాడులకు నిరసనగా నేడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో నిరసన తెలిపి మోడీ దిష్టి బొమ్మను కాంగ్రెస్ నాయకులతో కలసి రంగినేని అభిలాష్ రావు దహనం చేయడం జరిగింది._
ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు మీసాల పెద్ద రాముడు,జిల్లా మహిళా కార్యదర్శి శ్రీలత రెడ్డి వీపనగండ్ల మండల  అధ్యక్షులు గోదల బీరయ్య,మండల కిసాన్ సెల్ అధ్యక్షులు వెంకట్ రెడ్డి,కొల్లాపూర్ తాలుకా సోషల్ మీడియా ఇంఛార్జి పరమేష్,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజశేఖర్,వీపనగండ్ల గ్రామ అధ్యక్షులు నక్క విష్ణు,గోవర్ధనగిరి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మేకల సుబ్రమణ్యం,గ్రామ ఉపాధ్యక్షులు రాచూరి బీరయ్య వీపనగండ్ల సీనియర్ నాయకులు పోతుల వెంకట్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.