సోనియాతో భేటీకానున్న సీఎం కిరణ్‌ కుమార్‌

న్యూఢిల్లీ, జనంసాక్షి: రెండు రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి శక్రవారం పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ అయ్యారు. ఆరోపణలున్న మంత్రుల తొలగింపు వ్యవహారం, మంత్రికవర్గ పునర్‌వ్యవస్తీకరణ, కార్పోరేషన్‌ ఛైర్మన్ల నియామకంపై ఈ భేటీలో సీఎం చర్చించనున్నట్లు సమాచారం. అలాగే తనపై కొందరు మంత్రులు చేసిన ఆరోపణలకు కూడా కిరణ్‌ సమాధాన మివ్వనున్నారు.