*సోనియా గాంధిపై ఈడి కేసులకు నిరసనగా మోడి దిష్టిబొమ్మ దహనం*

పెబ్బేరు జులై 22 ( జనంసాక్షి ): ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు కృషి చేసిన ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ పై కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా ఈడీ కేసుల పేరిట అక్రమ కేసులను బనాయిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  దిష్టిబొమ్మ ను సుభాష్ చౌరస్తా లో దహనం చేశారు. సందర్భంగా వారు  మాట్లాడుతూ దేశంలో అత్యున్నత పదవిలో ఉన్న నరేంద్ర మోడీ  ప్రజాస్వామ్యాన్ని తుంగలో  తొక్కుతున్నారని అన్నారు.  ప్రజల కోసం పోరాటం చేస్తున్న వారిపై తప్పుడు కేసులు బనాయిస్తూ  దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారని ఇది సిగ్గుచేటు అని తెలిపారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎద్దుల విజయవర్దన్ రెడ్డి,మాజీ సర్పంచులు వెంకటేష్ సాగర్, సురేందర్ గౌడ్, మాజీ ఎంపీటీసీ సభ్యులు మణ్యం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బుర్ర మోని రాములు యాదవ్,నరేందర్, ఎస్సీ సెల్ కోశాధికారి శర్వేష్ ,టౌన్ యుత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రణధీర్ రెడ్డి, పాతపల్లి చంద్రశేఖర్, జాంగీరు,బాను,ఆల్వాల సాయి తేజ గౌడ్, హేమంత్ రెడ్డి, పరుశురాం,గంధం సునిల్,వినయ్,ఎం.డి.సాదిక్, అనిల్, బోటు శ్రీను, తదితరులు పాల్గొన్నారు.