సోనియా గాంధీ కుటుంబం పై కక్షసాధింపు చర్యే!

బీజేపీ చేసే చిల్లర రాజకీయాలకు భయపడం
దౌల్తాబాద్ జూలై 22, జనం సాక్షి.
దౌల్తాబాద్ మండల కేంద్రంలో శుక్రవారం టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కర్నాల శ్రీనివాసరావు పత్రికా సమావేశం ఏర్పటుచేసి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలను పక్కదారి పట్టించేందుకే ఈడీ విచాచరణ పేరుతో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఈడీ దాడులు చేయిస్తున్నారని , ఇలాంటి దాడులతో కాంగ్రెస్ పార్టీ, సోనియా, రాహుల్ గాంధీల ఆత్మస్థైర్యం దెబ్బ తీయలేదని పేర్కొన్నారు. గొడుగుపల్లి మాజీ ఎంపీటీసీ మద్దెల స్వామి మాట్లాడుతూ.. ఈడీ ద్వారా ఇబ్బందులకు గురిచేస్తే రాజకీయంగా మానసిక ఆనందం వస్తుందా..? అని దుయ్యబట్టారు. ఇది రాజకీయ పోరాటం కాదు.. ఆత్మ గౌరవ పోరాటమన్నారు.
పెరిగిన ధరలు, జీఎస్బీ ఇంధన ధరలపై పార్లమెంట్ ప్రశ్నిస్తుంటే.. సోనియాను ఈడీ ఆఫీసుకు పిలిచారన్నారు. ప్రభుత్వ సొమ్మును దోచుకతిన్న దొంగలను శిక్షించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సమాచార హక్కు చట్టం తెచ్చారని, ఒక వేళ అమెనే దోచుకుంటే ఈ చట్టం తెచ్చేవారా అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలను ఇబ్బందులు పెడుతున్న మోడీ తగిన మూల్యం చెల్లించాల్సిన రోజు వస్తుందన్నారు.
ఇదంతా భారత్ జోడో యాత్రను అడ్డుకునేందుకు కుట్ర అని సోనియా, రాహుల్ను తప్పుడు కేసులతో వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈడీ, సీబీఐ, కోర్టులపై ఒత్తిడి చేసి విపక్ష పార్టీల అంతానికి కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ అధి కారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగాల లేవని, ధరలు మాత్రం పెంచుతున్నారని మండిపడ్డారు. అక్టోబర్ 2 నుంచి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాంగ్రెస్ శ్రేణులు
రాహుల్ గాంధీ చేపట్టబోయే భారత్ జోడో పాదయాత్రకు ఇబ్బం దులకు గురిచేస్తున్నారని తెలిపారు. ఈడీ విచారణ చేసినంత మాత్రాన కాంగ్రెస్ భయపడదని, భారత్ జోడో యాత్రపై వెనక్కి తగ్గేదిలేదని, బీజేపీని బంగాళాఖా తంలో కలిపేవరకు విశ్రమించేది లేదని హెచ్చరించారు.
Attachments area