స్కూల్‌ బస్సును ఢీకొన్న రైలు 50మంది విద్యార్థుల మృతి

 

ఈజిప్ట్‌: వేగంగా వెళుతున్న  రైలు స్కూల్‌ బస్సును ఢీకొన్న సంఘటనలో 50మంది విద్యార్థులు మృతి చెందారు. ఈ సంఘటన రాజధాని కైరోకు 350కిలోమీటర్ల దూరాన గల మెన్‌ఫలుట్‌ జిల్లా అల్‌-మందర గ్రామంలో ఈ ఘోరం జరిగింది. కైరో నుంచి అస్వాన్‌ వెళుతున్న ఒక రైలు, రోడ్డు-రైలు మార్గం మీదుగా 60మంది పిల్లలతో వెళుతున్న బస్సును ఢీకొంది. చిన్నారులంతా వారు చదువుకుంటున్న మత విద్యా సంస్థకు వెళుతున్నప్పుడు ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో మరో 13మంది గాయపడ్డారు. మృతుల కుటుంబాలకు  అవసరమైన సాయం చేయాల్సిందిగా దేశాధ్యక్షుడు మహ్మద్‌ మొర్సి ఆదేశాలిచ్చారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ రవాణా మంత్రి రషద్‌ అల్‌-మెయితిని, రైల్వే విభాగం అధిపతి మొస్తఫా కెనవి రాజీనామాలను అధ్యక్షుడు మొర్సి ఆమోదించాడు.