స్టాట్యూ ఆఫ్ యునిటి సందర్శనకు ఏర్పాట్లు
ప్రత్యేక సర్క్యూట్ రైలు నడిపేందుకు చర్యలు
న్యూఢిల్లీ,ఫిబ్రవరి25(జనంసాక్షి): గుజరాత్ స్టాట్యూ ఆఫ్ యునిటీని సందర్శించే అవకాశం వచ్చింది. దీనిని చూసి తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం భారత రైల్వేశాఖ పర్యాటకుల కోసం ప్రత్యేక రైలును నడపనుంది. గుజరాత్ రాష్ట్రంలో వేలకోట్ల రూపాయలతో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద స్టాట్యూ ఆఫ్ యూనిటీ సందర్శకుల కోసం ప్రత్యేక రైలును నడపాలన రైల్వేశాఖ నిర్ణయించింది. గుజరాత్ లోని నర్మద డ్యామ్ వద్ద ఏర్పాటు చేసిన విగ్రహ సందర్శనకు వీలుగా ఈ ప్రత్యేక రైలును నడపనున్నారు. ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.7,560 చార్జీగా వసూలు చేయనున్నారు. ఈ ప్యాకేజీలో డార్మిటరీ వసతితోపాటు శాకాహార భోజనం కూడా పర్యాటకులకు అందించనున్నారు. ఐదు నెలల క్రితం ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్టాట్యూ ఆఫ్ యూనిటీని ప్రారంభించారు. సందర్శకుల కోసం ఈ ప్రత్యేక రైలును మార్చి 4న ప్రారంభించనున్నారు. /ూరత్ దర్శన్ టూర్ స్కీం కింద 8 రోజుల పర్యటన ప్యాకేజీపై ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ప్రత్యేక రైలును నడపనుంది. చండీఘడ్ నుంచి ప్రారంభమై ఉజ్జయినిలోని పుణ్యక్షేత్రాలైన మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ, ఇండోర్ లోని ఓంకారేశ్వర జ్యోతిర్లింగ, షిర్డీ సాయిబాబా దర్శన్,నాసిక్ లోని త్రయంబకేశ్వర్, ఔరంగాబాద్ ల విూదుగా ఈ యాత్ర సాగనుంది. చండీఘడ్ తోపాటు అంబాలా, కురుక్షేత్ర, కర్నాల్, పానిపట్, ఢిల్లీ కంటోన్మెంటు, రేవారి, అల్వార్, జైపూర్ లవిూదుగా సాగే ఈ యాత్ర ప్రత్యేక రైలు సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం సందర్శనతో ముగుస్తోంది.