స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనర

విశాఖపట్నం : అగ్నేయ బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో అల్పపీడన ప్రాంతం స్థిరంగా కొనసాగుతున్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడనం బలపడి 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశమున్నట్లు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈనెల 12 తరువాత రాష్ట్రంలో వాయుగుండం ప్రభావం ఉండొచ్చని వివరించారు.