స్మశాన వాటికలో చెత్తా చెదారాలు

అక్టోబర్ 17(జనం సాక్షి)
రాజోలి గ్రామ పంచాయతీ పరిధిలోని తుమ్మలపల్లి లో స్మశాన వాటికపై అధికారుల పర్యవేక్షణ కరువైంది. దీంతో స్మశాన వాటిక కాస్త డంపింగ్ యార్డు గా మారుతుందని బీజేపీ మండల అధ్యక్షుడు సంజీవరెడ్డి అన్నారు. గ్రామంలోని చెత్త చెదారాలు,ఇతర వ్యర్ధాలను అక్కడే తెచ్చి వేస్తుండటం తో ఆ పరిసరాల్లో మొత్తం చెత్త పేరుకుపోయింది అని అన్నారు.గత దశాబ్దాల కాలంగా చనిపోయిన వారిని అక్కడే పూడ్చుతుండగా,ప్రస్తుతం నెలకొన్న అపరిశుభ్ర పరిసరాల వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురవ్వడం జరుగుతుంది అని అన్నారు.చిన్న పాటి వర్షం కురిస్తే అక్కడ కాలు పెట్టలేని పరిస్థితి దాపురించిందని అన్నారు.అధికారులు నాయకులు దీనిపై స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.