స్వతంత్య్రం విలువ నేటి తరానికి తెలియడం లేదు

సీనియర్ న్యాయవాది రామ రంగారావు
మిర్యాలగూడ. జనం సాక్షి.
శతాబ్దాల కాలపు బానిసత్వం నుండి విముక్తి కోసం, స్వరాజ్య స్థాపన కోసం, స్వేచ్చాయుత జీవనం కోసం లక్షలాది సమరయోధుల బలిధానాలతో,75 సంవత్సరాల క్రితం స్వాతంత్య్రం మనకు సిద్దించింది. కానీ నేటి తరానికి స్వతంత్రం విలువ.. స్వతంత్ర పోరాటంలో అసువులు బాసిన అమరుల త్యాగం విలువ బానిసత్వ భాధలు, తెలియకుండా పోతుందని సీనియర్ న్యాయవాది, పాత్రికేయులు తడకమల్ల రామ రంగారావు అన్నారు. ఏ విదేశీ పాలన నుండి విముక్తి కోసం స్వతంత్ర సంగ్రామం జరిగిందని తెలియని నేటి తరం పౌరులకు విదేశీ వ్యామోహం, విదేశీ వస్తువులపై మక్కువ, విదేశీ సంస్కృతి పట్ల ఆకర్షణ అవాంఛనీయంగా పెరుగుతుందని మన పాలకులు, పాలన కూడా విదేశీ వ్యామోహం లో కొట్టుకుపోతుందాన్నారు. దేశంలో అవినీతి, లంచగొండితనం, బాధ్యతా రాహిత్యం విలయ తాండవం చేస్తున్నాయని,స్వాతంత్ర సమరయోధులను గాంధీ, నెహ్రూ, పటేల్,ఆజాద్. సుభాష్ చంద్రబోస్,అల్లూరి సీతారామరాజు. భగత్ సింగ్. లాలా లజపతిరాయ్ వంటి అనేక మహనీయుల గురించి నవతరం పౌరులు తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని రంగారావు అన్నారు. దేశభక్తిని పెంపొందించాల్సిన బాధ్యత ప్రభుత్వం దేనని, విద్యా వైద్య రంగాలను అభివృద్ధి చేయగలిగితే పేద ప్రజలకు సైతం విద్య వైద్యం అందించగలిగినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు
. స్వతంత్ర పోరాట చరిత్రను ఒకటో తరగతి నుండి ఉన్నత విద్య వరకు విధిగా బోధన అంశాలను చేర్చాలని అభిప్రాయపడ్డారు.