స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో మేము సైతం…

– విద్యార్థులు ముచ్చర్ల అభినయ్ రెడ్డి, చిన్ని కృష్ణ రెడ్డి.
ఊరుకొండ, ఆగస్టు 14 (జనం సాక్షి):
స్వాతంత్ర్య భారత 75వ వజ్రోత్సవాలలో భాగంగా ఆదివారం ప్రభుత్వ ఆదేశానుసారంగా మేము సైతం అంటూ విద్యార్థులు ముచ్చర్ల అభినయ్ రెడ్డి, చిన్ని కృష్ణ రెడ్డి లు తమ ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగరవేసి తమ దేశభక్తిని చాటుకున్నారు. ఆదివారం ఊరుకొండ మండల పరిధిలోని ముచ్చర్లపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మరియు కబడ్డీ, కరాటే అసోసియేషన్ జిల్లా చైర్మన్ ముచ్చర్ల జనార్దన్ రెడ్డి తనయులు అభినయ్ రెడ్డి యూఎస్ లో బి బి ఏ చదువుతున్నాడు. చిన్ని కృష్ణ రెడ్డి ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కాగా సెలవులపై తమ సొంత ఇంటికి వచ్చి తమకు ఉన్న దేశభక్తితో ఇంటిపై ఆదివారం జాతీయ జెండాను ఎగరవేసి దేశభక్తిలో మేము సైతం అంటూ నిరూపించారు. తమ పిల్లలకు ఉన్న దేశభక్తి పట్ల తల్లిదండ్రులు అభినందించడంతోపాటు ప్రతి ఒక్కరు ఇలాగే తమ తమ ఇళ్లపై జాతీయ జెండాలు ఎగరవేసి స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు.