స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని రక్తదాన శిబిరం.
కౌడిపల్లి (జనంసాక్షి). స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని కౌడిపల్లి మండల కేంద్రంలో బుధవారం రోజున రక్తదాన శిబిరం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు వెంకట యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదాన శిబిర కార్యక్రమానికి యువజన సంఘాలతో పాటు, ఆయా శాఖల అధికారులు సైతం రక్తదానం చేయడం జరిగిందని, రక్తదాన శిబిరంలో మొత్తంగా 50 యూనిట్ల రక్తం సేకరించడం జరిగిందని,రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. రక్తదాన శిబిరం కార్యక్రమానికి ఎంపీపీ రాజు నాయక్, జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు, ఎంపీడీవో భారతి,నర్సాపూర్ సిఐ షేక్ లాల్ మదర్, కౌడిపల్లి ఎస్సై శివప్రసాద్రెడ్డి, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సారా రామా గౌడ్, వెల్మకన్న ఇంచార్జ్ సర్పంచ్ రాజేందర్ నాయకులు నర్సింగరావు తోపాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
