స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి..
టేక్మాల్ జనం సాక్షి సెప్టెంబర్ 2 ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా టేక్మాల్ గాంధీభవన్ లో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళి అర్పించిన కాంగ్రెస్ నాయకులు. మండల పార్టీ అధ్యక్షులు నిమ్మ రమేష్ మాట్లాడుతూ ఆయన మరణం ఒక కాంగ్రెస్ పార్టీకే కాదు యావత్ తెలుగు ప్రజలకు తీరని లోటు అన్నారు. వైయస్సార్ భౌతికంగా లేకపోయినా మంచి మనసుతో మంచి పనులు చేసిన నాయకుడు ఎప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో చల్ల అడివప్ప, తిమ్మిగారి సుధాకర్, ఆకులపల్లి పాపయ్య, భక్తుల కిషోర్, నాగులపల్లి రాజేశ్వర్ గౌడ్, చల్ల అనిల్, సాగర్, నర్సింలు, శివ గౌడ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.