స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలపై ఉగ్రకన్ను

ఇంటిలిజెన్స్‌ హెచ్చరికలతో అప్రమత్తమైన బలగాలు
రెడ్‌ఫోర్ట్‌ సహా పాలు ప్రాంతాల్లో పటిష్ట భద్రత

న్యూఢల్లీి,ఆగస్ట్‌4(జనం సాక్షి ): స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఇంటలిజెన్స్‌ వర్గాల హెచ్చరికలు జారీ చేసింది. లష్కరే తోయిబా, జైషే మహ్మద్‌ తీవ్రవాద గ్రూపులు ఉగ్రదాడి చేసే అవకాశం ఉందని ఐబీ నివేదికను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఎర్రకోటలో ప్రవేశ నిబంధనలను కఠినతరం చేయాలని ఐబీ ఢల్లీి పోలీసులకు సూచించింది. జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబేపై దాడి, ఉదయపూర్‌, అమరావతిలో జరిగిన ఘటనలను నివేదికలో ప్రస్తావించిన ఐబీ… అప్రమత్తంగా ఉండాలని ఢల్లీి పోలీసులను ఆదేశించింది. రాడికల్‌ గ్రూపులపై, రద్దీ ప్రదేశాలపై కట్టుదిట్టమైన నిఘా పెట్టాలని ఇంటలిజెన్స్‌ వర్గాల సూచించాయి. పెద్ద నాయకులు, ముఖ్యమైన ప్రదేశాలను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఐబీ హెచ్చరించింది. ఢల్లీిలోని రోహింగ్యాలు, ఆఫ్ఘనిస్తాన్‌ నేషనల్‌ సూడాన్‌ ప్రజలు నివసిస్తున్న ప్రాంతాలపై కఠినమైన పర్యవేక్షణ ఉంచాలని ఇంటలిజెన్స్‌ తన నివేదికలో పేర్కొంది. టిఫిన్‌ బాంబు, స్టిక్కీ బాంబు, వీవీఐడీలు పెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని రాష్టాల్రూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులను ఐబీ అప్రమత్తం చేసింది. ఢల్లీి పోలీసులను అలర్ట్‌ చేస్తూ ఇంటెలిజెన్స్‌ బ్యూరో ఉగ్రదాడులు జరిగే అవకాశాలపై 10 పేజీల రహస్య నివేదికను పంపింది.స్వాతంత్య దినోత్సవం జరిగే రెడ్‌ ఫోర్టుప్రాంతంలో ప్రజల ప్రవేశాన్ని కట్టుదిట్టం చేయాలని ఐబీ సూచించింది. జన
సమ్మర్ధ ప్రదేశాల్లో ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలపై నిఘా వేయాలని ఐబీ సూచించింది.ప్రధాన ప్రాంతాల్లో కీలక నాయకులపై దాడులు చేయాలని పాక్‌ ఐఎస్‌ఐ జైషే మొహమ్మద్‌, లష్కరే తోయిబా ఉగ్రవాదులను కోరినట్లు సమాచారం ఉందని ఐబీ తెలిపింది.అఫ్ఘానిస్థాన్‌ ఉగ్రవాది నేతృత్వంలో లష్కరే ఖల్సా పేరిట పాక్‌ ఐఎస్‌ఐ ఉగ్రవాద సంస్థను ఏర్పాటు చేసిందని, ఆ సంస్థ ఉగ్రవాదులు జమ్మూకశ్మీరులో పెద్ద ఉగ్రదాడికి పాల్పడే అవకాశముందని ఐబీ వివరించింది. లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్‌ ఉగ్రవాదులు పారాª`లగైడర్స్‌, డ్రోన్ల ద్వారా దాడులకు తెగబడే అవకాశమున్నందున బీఎస్‌ఎఫ్‌ దళాలు అప్రమత్తంగా ఉండాలని ఐబీ కోరింది. ఢల్లీిలో రోహింగ్యాలు, ఆఫ్ఘానిస్థాన్‌, సుడాన్‌ దేశాల వాసులు నివాసం ఉంటున్న ప్రాంతాలపై ఢల్లీి పోలీసులు నిఘా వేయాలని కోరారు. టిఫిన్‌ బాంబులతో కూడా ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశమున్నందున పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఇంటెలిజెన్స్‌ తన రహస్య నివేదికలో హెచ్చరించింది.