*స్వాతంత్ర వజ్రోత్సవాలలో భాగంగా వన మహోత్సవంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి.
నేరేడుచర్ల (జనం సాక్షి )న్యూస్.భారత స్వతంత్ర వజ్రోత్సవాలు పురస్కరించుకొని నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో బిసి,ఎస్ టి వసతి గృహ విద్యార్థులతో కలిసి హుజూర్నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి ఆదివారం నాడు వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ మొక్కలే భావితరాలకు పెన్నిధి అని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు వసతి గృహ విద్యార్థులతో కాసేపు ముచ్చటించి వారి సదుపాయాల పైన అందుతున్న ఆహార నాణ్యత సక్రమంగా మెనూ పని చేస్తున్నాయని ఆరా తీశారు .ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షురాలు శ్రీలత రెడ్డి,జెడ్పిటిసి రాపోలు నరసయ్య, గ్రంథాలయ శాఖ చైర్మన్ మార్కండేయ, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు,వివిధ వార్డుల కౌన్సిలర్లు,టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు సురేష్ బాబు, పట్టణ టిఆర్ఎస్ నాయకులు వల్లంశెట్ల రమేష్ బాబు, వింజమూరి రాములు, వసతి గృహల వార్డెన్లు సైదులు,చందూలాల్ నాయక్, వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.గ్రామపంచాయతీలలో:- -*
భారత స్వాతంత్ర వజ్రోత్సవాలలో భాగంగా ఆదివారం మండలం లోని17 గ్రామపంచాయతీలో వనమహోత్సవం కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమాలలో ఎంపీపీ జ్యోతి
జడ్పిటిసి రాపోలు నర్సయ్య, ఆయా గ్రామాల సర్పంచ్ లు సర్పంచ్లు, ఎంపీడీవో శంకరయ్య, ఏపీఓ శేఖర్,ఈసి, పంచాయతీ కార్యదర్శిలు మరియు టెక్నికల్
అసిస్టెంట్లు తదితరులు ఉన్నారు.
