స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఫ్రీడం రన్

రామకృష్ణాపూర్ , (జనంసాక్షి) :
పురపాలక పరిపాలన శాఖ సంచాలకుల ఆదేశాల మేరకు గురువారం నాడు క్యాతనపల్లి మున్సిపాలిటీ లో స్వతంత్ర భారత వజ్రోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. .అనంతరం టాగూర్ స్టేడియం నుండి రామాలయం కమాన్ వరకు ఫ్రీడం రన్ కొనసాగించారు. దేశ భక్తిని చాటి చెప్పడానికి, స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను గుర్తు చేస్తూ 75 వసంతాల స్వాతంత్ర్యాన్ని జరుపుకోవడం భారతీయుల గొప్ప అదృష్టమని మున్సిపల్ కమిషనర్ వెంకట నారాయణ అన్నారు. ఈ కార్యక్రమములో పట్టణ ఎస్.ఐ. అశోక్, చైర్మన్ జంగం కళ, వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి, కౌన్సిలర్లు, మేనేజర్ నాగరాజు, రెవెన్యూ అధికారి కృష్ణ ప్రసాద్, ఇంచార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ వసంత్, టి ఎం సి శ్రీధర్, ఆర్.పి లు, పట్టణ ప్రజలు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.