హంపి పీఠాధిపతులకు స్వాగతం పలికిన ప్రహల్లాదరావు

మల్దకల్ అక్టోబర్ 13 (జనంసాక్షి)ఆదిశేలాక్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మార్గశిర మాసం శుక్లపక్ష పౌర్ణమిన జరిగే రథోత్సవ కార్యక్రమానికి హాజరై భక్తులను అనుగ్రహించాలని మల్దకల్ శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వ్యవస్థాపక వంశీయులు శ్రీ కృష్ణ మాన్య పట్వారి ప్రహ్లాద రావు కర్ణాటక రాష్ట్రంలోని హంపి పీఠాధిపతులు శ్రీ శ్రీ విద్యారణ్య భారతీనంద స్వాములు వారిని కోరారు.గురువారం హంపికి తరలి వెళ్లిన ప్రహల్లాద రావు తో పాటు చంద్రశేఖర రావు, టపా నరసింహులు ఆయన సతీమణి యోగ జయలక్ష్మి తదితరులు కలిసి స్వామివారిని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు.ఈ సందర్భంగా హంపి మఠం లోని దేవాలయాలు తదితర ప్రాంతాలను సందర్శించి వివరాలు తెలిపారు.