హమాలీ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి.

కౌడిపల్లి (జనంసాక్షి). హమాలీ కార్మికులకు వెల్ఫేర్ బోర్డును ఏర్పాటుచేసి అమలు చేయాలనీ డిమాండ్ చేశారు.ఆగస్టు మూడో తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కౌడిపల్లి మండల కేంద్రం హమాలి గ్రామ యూనియన్ తోపాటు సీఐటీయూ  ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ పోస్టర్ను విడుదల  చేశారు.ఈసందర్భంగా హమాలి యూనియన్ అధ్యక్షుడు రెడ్డి దుర్గయ్య,శేకర్,అశోక్ మాట్లాడుతూ హమాలి కార్మికుల జీవితమంతా హమాలి చేసిన రక్షణ లేదన్నారు.పని చేసే చోట ప్రమాదాలు జరిగిన పట్టించుకునే నాధుడు లేరన్నారు.పనికి నిర్దిష్టమైన సమయము లేకుండా హమాలీలు పనిచేస్తున్నారన్నారు. ఎంత చేసినప్పటికీ హమాలీలకు  వెల్ఫేర్ బోర్డు లేకపోవడం అత్యంత దుర్మార్గంమన్నారు. ప్రభుత్వం హమాలీలు లేకుండా ఎలాంటి విధులు నిర్వహించలేదని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి హమాలి కార్మికులకు వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని,డబల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇవ్వాలని,ఇతర సౌకర్యాలు కల్పించాలని 50 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ అమలు చేయాలని కోరుతూ ఈ ధర్నా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.ఆగస్టు మూడవ తేదీన ఇంద్ర పార్క్ దగ్గర జరిగే ధర్నాకు మండలంలోని హమాలి కార్మికులందరూ పెద్ద సంఖ్యలో తరలిరావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో అమృథ్, బిక్షపతి, రాములు,మల్లేశం , తదితరులు పాల్గొన్నారు.