హరీష్‌ క్యాంప్‌ ఆఫీస్‌పై కాంగ్రెస్‌ దాడి

ప్రతిగా నల్లబ్యాడ్జీలతో బిఆర్‌ఎస్‌ నిరసనలు
దాడిని తీవ్రంగా ఖండిరచిన ఎమ్మెల్యే హరీష్‌
సిద్దిపేట,ఆగస్ట్‌17  (జనం సాక్షి):  సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు క్యాంప్‌ ఆఫీస్‌పై కాంగ్రెస్‌ కార్యకర్తల దాడికి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు నిరసన తెలిపారు. సిద్దిపేట పట్టణంలో నల్ల కండువాలు కప్పుకుని నల్ల జెండాలతో ర్యాలీ నిర్వహించారు. భారీగా తరలివచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీగా క్యాంప్‌ ఆఫీస్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో హరీశ్‌రావు రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్‌ ఏర్పాటుచేసిన ప్లెక్సీలను చించివేశారు. ఈ నేపథ్యంలో సిద్దిపేట పట్టణంలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. మరోవైపు హరీశ్‌ రావుకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ కార్యకర్తలు క్యాంప్‌ ఆఫీస్‌ను ముట్టడిరచేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. కాగా, ఇరుపక్షాల పోటాపోటీ ప్రదర్శణలతో సిద్దిపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్‌ నేతలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ రావు తీవ్రస్థాయిలో ్గªర్‌ అయ్యారు. కాంగ్రెస్‌ గూండాలు తమ కార్యకర్తలపై దాడులకు తెగపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం అర్థరాత్రి సిద్ధిపేటలో జరిగిన ఘటనపై స్పందించిన హరీష్‌ రావు.. కాంగ్రెస్‌ నేతల తీరును తీవ్రంగా ఖండిరచారు. సిద్ధిపేట ఎమ్మెల్యే అధికారిక నివాసంపై అర్థరాత్రి కాంగ్రెస్‌ గూండాలు దాడి చేసి తాళాలు పగలగొట్టారని హరీష్‌ రావు ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయడం దారుణం అన్నారు. ఈ దాడిని అడ్డుకోవాల్సిన పోలీసులే దుండగులను రక్షించడం మరింత శోచనీయం అని విమర్శించారు. ఒక ఎమ్మెల్యే నివాసంపైనే ఇంత దారుణంగా దాడి జరిగిందంటే.. ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. పోలీసుల సమక్షంలో ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసి ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడం కాంగ్రెస్‌ మార్క్‌ పాలనకు నిదర్శనం అని విమర్శించారు. ఈ ఘటనపై రాష్ట్ర డీజీపీ వెంటనే స్పందించి, చర్యలు తీసుకోవాలని హరీష్‌ రావు డిమాండ్‌ చేశారు. సిద్ధిపేటలో అర్థరాత్ర ప్లెక్సీ వార్‌ జరిగింది. అర్థరాత్రి హైడ్రామా నడిచింది. మాజీ మంత్రి హరీష్‌ రావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కోరుతూ సిద్ధిపేటలో ప్లెక్సీలు వెలిశాయి. ’రూ. 2 లక్షల రుణమాఫీ అయింది. నీ రాజీనామా ఎటు పాయె.. అబద్దాల హరీశ్‌ రావు’ అంటూ సిద్ధిపేట కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి పూజల హరికృష్ణ పేరిట పట్టణంలో ప్లెక్సీ బ్యానర్లు వెలిశాయి. ఈ ప్లెక్సీలపై బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కాంగ్రెస్‌ ప్లెక్సీలను తొలగించాలని బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఫ్లెక్సీలను తొలగించాలని బీజేఆర్‌ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించారు. దీంతో అలర్ట్‌ అయిన పోలీసులు.. ఆందోళనకు దిగిన బీఆర్‌ఎస్‌ నాయకులను, కార్యకర్తలను అరెస్ట్‌ చేశారు. దీంతో జేఆర్‌ చౌరస్తాలో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. మరోవైపు.. బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ శ్రేణులు సైతం ఆందోళనకు దిగాయి. ఇలా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఆందోళనలతో సిద్ధిపేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసులు సైతం భారీగా మోహరించారు.