హరీష్ రావు శుక్రవారం మనోహరబాద్ మండల కేంద్రం లో నూతనంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించడు

మెదక్ ప్రతినిధి జనం సాక్షి రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు శుక్రవారం మనోహరబాద్ మండల కేంద్రం లో నూతనంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించడంతోపాటు రెండు కోట్లు వ్యయంతో నిర్మించనున్న పిహెచ్సి భవనానికి శంకుస్థాపన చేశారు .50 లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించడంతోపాటు 15 లక్షలతో నిర్మించనున్న ఎస్సీ కమ్యూనిటీ భవనానికి శంకుస్థాపన చేశారు. 20 లక్షలతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ను ప్రారంభించారు. అనంతరం ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో 584 మంది నూతన లబ్ధిదారులకు ఆసరా పింఛన్లు అందజేశారు.
.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర అడవి అభివృద్ధి సంస్థ అధ్యక్షులు ఒంటేరు ప్రతాపరెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు చంద్ర గౌడ్, గడ ప్రత్యేక అధికారి ముత్యంరెడ్డి, జిల్లా కలెక్టర్ హరీష్, అదనపు కలెక్టర్లు ప్రతిమసింగ్,రమేష్, రాష్ట్ర సర్పంచ్ ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు