హస్తినలో గవర్నర్ బిజీ బిజీ

 ఢిల్లీ : దేశ రాజధానిలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ బిజీ బిజీగా గడుపుతున్నారు. రెండో రోజు పర్యటనలో రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని ముఖ్య కార్యదర్శితో గవర్నర్ భేటీ కానున్నారు. ప్రధానితో భేటీ కావడానికి అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అపాయింట్ మెంట్ లభిస్తే ప్రధానిని కలిసే అవకాశం ఉంది.

ఇటీవల ఇరు రాష్ట్రాలలోనూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశాలపై నివేదికను గవర్నర్ కేంద్ర పెద్దలకు అందజేయనున్నట్లు సమాచారం. ప్రధానంగా అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరు, రాష్ట్ర విభజన నేపథ్యంలో నెరవేర్చాల్సిన అంశాలు, పెండింగ్ లో వున్న అంశాలపై గవర్నర్ భేటీలో చర్చించే అవకాశం ఉంది.