ఢిల్లీ సామూహిక అత్యాచారం కేసులో ఈ నెల 10న తీర్పు

ఢిల్లీ : గత ఏడాది డిసెంబరులో వైద్యవిద్యార్థిపై సామూహిక అత్యాచారం కేసులో నలుగురు నిందితుల విచారణ పూర్తయింది. ఈ కేసును విచారించిన ఫాస్ట్‌ ట్రాక్‌ న్యాయస్థానం తీర్పును ఈ నెల 10న వెలువరించనుంది. మొత్తం అరుగురు నిందితుల్లో ఒకరు బాల నేరస్థుడిగా విచారణనెదుర్కొన్న సంగతి తెలిసిందే. మరో నిందితుడు జైలులో అత్మహత్య చేసుకున్నాడు. మిగిలిన నలుగురు నిందితుల విచారణ ఇవాళ్టితో పూర్తయింది.