11 జిల్లాల్లో ఖాతా తెరవని భాజపా

బెంగళూరు : కర్ణాటక విధాన సభ ఎన్నికల్లో భాజపా ఘోర పరాజయం పాలైంది. 11 జల్లాల్లో ఆ పార్టీ ఖాతా కూడా తెరవలేదు. మొత్తం 222 స్థానాల్లో ఆ పార్టీ పోటీ చేయగా 39 స్థానాల్లో గెలుపొంది ఒక చోట అధిక్యంలో ఉంది. మరో పార్టీ జేడీ (ఎస్‌)తో ప్రతిపక్ష హోదా కోసం పోటీ పడాల్సిన పరిస్థితి భాజపాకు వచ్చింది.