12 మంది అభ్యర్థులతో భాజపా నాలుగో జాబితా

హైదరాబాద్‌(జనంసాక్షి):భారతీయ జనతా పార్టీ12 మంది అభ్యర్థులతో నాలుగో జాబితాను ప్రకటించింది. ఇప్పటికే మూడు విడుతలుగా 88 మందిని ఖరారు చేసిన విషయం తెలిసిందే. దీంతో మొత్తం 100 స్థానాల్లో అభ్యర్థులను బరిలో నిలిపింది. మరో 19 స్థానాలు పెండిరగ్‌లో ఉండగా.. వాటిలో 7 సీట్లు జనసేనకు కేటాయించింది. నామినేషన్ల గడువు మరో మూడు రోజుల్లో ముగియనున్నప్పటికీ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం గమనార్హం.
బీజేపీ నాలుగో జాబితా..
చెన్నూరు` దుర్గం అశోక్‌
ఎల్లారెడ్డి` వీ. సుభాష్‌ రెడ్డి
వేములవాడ` తుల ఉమా
హుస్నాబాద్‌` బొమ్మ శ్రీరామ చక్రవర్తి
సిద్దిపేట` దూడి శ్రీకాంత్‌
వికారాబాద్‌` పెద్దింటి నవీన్‌ కుమార్‌
కొడంగల్‌` బంటు రమేష్‌ కుమార్‌
గద్వాల` బోయ శివ
మిర్యాలగూడ` సాదినేని శ్రీనివాస్‌
మునుగోడు` చెలమల్ల కృష్ణారెడ్డి
నకిరేకల్‌` నకరకంటి మొగులయ్య
ములుగు` అజ్మీరా ప్రహ్లాద నాయక్‌