13 వ తేదీన బెల్లంపల్లి లో వినూత్న కార్యక్రమం

25 వేల మంది ప్రజలతో సామూహిక జాతీయ గీతాలాపన, జాతీయ పతాకాలతో భారీ ర్యాలీ ఏ.సి .పి ఎడ్ల మహేష్

 

భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తి చేసుకొని వజ్రోస్తవాలు జరుపుకునే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజల్లో దేశభక్తి ని చాటి చెప్పేలా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతుంది.

ఏ.సి .పి ఎడ్ల మహేష్ మాట్లాడుతూ .. బెల్లంపల్లి పేరు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చేలా వినూత్న కార్యక్రమం చేపట్టనున్నట్లు . ప్రతి ఒక్కరి లో దేశ భక్తి ని చాటే విధంగా ఏకంగా 25000 మంది ప్రజలతో సామూహిక జాతీయ గీతాలాపన, జాతీయ పతాకాలతో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఏ.సి .పి ఎడ్ల మహేష్ తెలిపారు

దీనిలో భాగంగా బెల్లంపల్లి పట్టణంలో 13 వ తేదీ శనివారం రోజున బెల్లంపల్లి సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో బెల్లంపల్లి లోని NO – 2 గ్రౌండు లో ఉదయం 9 గంటలకు ప్రారంభించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో 25000 మంది , విద్యార్థిని విద్యార్థులు, మహిళలు, యువకులు విభిన్న స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యులు, కుల, మత, రాజకీయ, వర్గ, ధనిక, పేద, స్త్రీ, పురుష, భేదాలు లేకుండా ప్రజలందరితో సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అనంతరం NO – 2 గ్రౌండ్ నుండి కొత్త బస్టాండ్ వరకు కొత్త బస్టాండు నుండి నుండి NO – 2 గ్రౌండ్ వరకు జాతీయతా భావాన్ని పెంపొందించే, నినాదాలతో , స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయుల వేషధారణలతో, స్వాతంత్ర స్పూర్తిని రగిలించే పాటలతో , ప్రతి ఒక్కరూ ఒక్కొక్క జాతీయ జెండాను చేతపట్టుకొని ర్యాలీలో పాల్గొనడం జరుగుతుంది . మరియు విద్యార్థిని విద్యార్థులకు స్ఫూర్తి కలిగించే, విభిన్న రకాలైన సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించి ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డులో నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. కనుక ప్రజలందరిలో జాతీయతా భావాన్ని పెంపొందించడానికి , స్వాతంత్రం స్పూర్తిని కలిగించడానికి, బెల్లంపల్లి పట్టణ కీర్తిని ప్రపంచ వ్యాప్తంగా తెలియపరచడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని . బెల్లంపల్లి పట్టణ, చుట్టూ పక్కల గ్రామాల ప్రజలు , విద్యార్థులు , యువకులు , ఈ కార్యక్రమం లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ ఏ.సి .పి ఎడ్ల మహేష్ పిలుపునిచ్చారు