ఇరాక్లో 14 మంది ట్రక్కు డ్రైవర్ల కాల్చివేత
బాగ్దాద్,(జనంసాక్షి): ఇరాక్లో సాయుధ మిలిటెంట్లు చెలరేగి పోయారు. బాగ్దాద్ నుంచి కిర్కుక్ వెళ్లే ప్రధాన మార్గంలో వెళ్లిన 14 ట్రక్కుల డ్రైవర్లను కాల్చివేసి ట్రక్కులతో పరారైనట్లు తెలుస్తుంది. కొంతమంది సాయుధులు నకిలీ చెక్పాయింట్ను ఏర్పాటు చేసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం.