15 క్వింటాళ్ల నల్లబెల్లం,1 క్వింటాలు పట్టిక స్వాధీనం

వివరాలు వెల్లడించిన ఎస్సై రమేష్ బాబు
కేసముద్రం అక్టోబర్ 21 జనం సాక్షి / శుక్రవారం రోజున విశ్వసనీయ సమాచారం మేరకు కేసముద్రం మండలం కాట్రపల్లి గ్రామ శివారు ఫారెస్టులో 15 క్వింటాళ్ల నల్లబెల్లం,1 క్వింటాలు పట్టికను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై చిర్రా రమేష్ బాబు తెలిపారు.ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ కాట్రపల్లికి చెందిన బాదావత్ దస్రును బెల్లం దాచిన వ్యక్తిగా గుర్తించామన్నారు.  ఎస్సై కోగిల తిరుపతి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Attachments area