విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు
ఇద్దరు విద్యార్థుల దుర్మరణం
హైదరాబాద్,అగస్టు12(జనం సాక్షి): నగరంలోని గండిపేట వద్ద జరిగిన కారు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందారు. మృతి చెందిన వారిని సుచిత్రకు చెందిన కౌశిక్, జో డౌన్ అనే విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. గండిపేట సీబీఐటి రోడ్డులో విద్యుత్ స్తంభాన్ని కారు ఢీకొట్టుకుని ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గండిపేట నుంచి నార్సింగ్ వైపు కారులో ఐదుగురు విద్యార్థులు వెళ్తున్నారు. కారు నడిపే సమయంలో రోడ్డు విూద అడ్డు వచ్చిన ఆటోను తప్పించబోయి కరెంటు స్తంభాన్ని కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. సీబీఐటీ కాలేజీలో ఎగ్జామ్ ఉందని కౌశిక్ అనే విద్యార్థి వచ్చి మృత్యువాత పడ్డాడు. సంఘటనా స్థలానికి చేరుకొని నార్సింగ్ పోలీసులు విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
- నెల రోజులుగా వృధాగా పారుతున్న మిషన్ భగీరథ నీరు
- ఉప్పల్ లో స్కైవాక్ లిఫ్ట్లో సాంకేతిక లోపం.. గంటలపాటు బందీగా యువకుడు
- ఉప్పల్ భగాయత్లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం
- ఉప్పల్లో మోదీ పాలన 4399 రోజుల సంబరాలు
- ఎదురుగా వస్తున్న ట్యాంకర్ను ఢీకొన్న బైక్: ఇద్దరికి తీవ్ర గా యాలు
- ఉప్పల్ భగాయత్ హెచ్ఎండిఏ లేఅవుట్లో లోకాయుక్త నిజనిర్ధారణ కమిషన్ విస్తృత పర్యటన
- కాంగ్రెస్ నేతలకు దృష్టి, వినికిడి పరీక్షలు అవసరం
- నెల రోజులుగా వృధాగా పారుతున్న మిషన్ భగీరథ నీరు
- ఉప్పల్ భగాయత్ భూములపై ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టిన తెలంగాణ రక్షా సేన అధినేత కవిత
- యాప్లో యూరియా బుకింగ్.. రైతులకు మాత్రం తిప్పలే తిప్పలు!
- మరిన్ని వార్తలు



