విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు
ఇద్దరు విద్యార్థుల దుర్మరణం
హైదరాబాద్,అగస్టు12(జనం సాక్షి): నగరంలోని గండిపేట వద్ద జరిగిన కారు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందారు. మృతి చెందిన వారిని సుచిత్రకు చెందిన కౌశిక్, జో డౌన్ అనే విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. గండిపేట సీబీఐటి రోడ్డులో విద్యుత్ స్తంభాన్ని కారు ఢీకొట్టుకుని ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గండిపేట నుంచి నార్సింగ్ వైపు కారులో ఐదుగురు విద్యార్థులు వెళ్తున్నారు. కారు నడిపే సమయంలో రోడ్డు విూద అడ్డు వచ్చిన ఆటోను తప్పించబోయి కరెంటు స్తంభాన్ని కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. సీబీఐటీ కాలేజీలో ఎగ్జామ్ ఉందని కౌశిక్ అనే విద్యార్థి వచ్చి మృత్యువాత పడ్డాడు. సంఘటనా స్థలానికి చేరుకొని నార్సింగ్ పోలీసులు విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
- బాథుకమ్మకుంట–బాఘ్ అంబర్పేట్లో సైబర్ క్రైమ్, డ్రగ్స్పై పోలీసుల అవగాహన
- అంబర్పేట్ మీసేవ కేంద్రంపై ఏసీబీ సోదాలు
- మాడుగులపల్లిలో తప్పిన పెను ప్రమాదం డివైడర్పైకి దూసుకెళ్లిన ప్రైవేట్ బస్సు
- కమాన్ పూర్ ఆదివరాహ స్వామి దేవస్థానం చైర్మెన్ గా ముస్త్యాల దామోదర్
- రోడ్డు భద్రత – ప్రతి ఒక్కరి బాధ్యత
- ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి
- రైతులు దళారీలను ఆశ్రయించొద్దు
- అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎస్సీ రైతులకు రక్షణ షూస్ పంపిణీ
- అంబేద్కర్ 135వ జయంతి బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు నివాళులు
- 1.85 కోట్ల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్, కల్యాణ లక్ష్మి చెక్కులు మంజూరుచేయించిన మంత్రి శ్రీధర్ బాబు
- మరిన్ని వార్తలు


