విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు
ఇద్దరు విద్యార్థుల దుర్మరణం
హైదరాబాద్,అగస్టు12(జనం సాక్షి): నగరంలోని గండిపేట వద్ద జరిగిన కారు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందారు. మృతి చెందిన వారిని సుచిత్రకు చెందిన కౌశిక్, జో డౌన్ అనే విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. గండిపేట సీబీఐటి రోడ్డులో విద్యుత్ స్తంభాన్ని కారు ఢీకొట్టుకుని ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గండిపేట నుంచి నార్సింగ్ వైపు కారులో ఐదుగురు విద్యార్థులు వెళ్తున్నారు. కారు నడిపే సమయంలో రోడ్డు విూద అడ్డు వచ్చిన ఆటోను తప్పించబోయి కరెంటు స్తంభాన్ని కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. సీబీఐటీ కాలేజీలో ఎగ్జామ్ ఉందని కౌశిక్ అనే విద్యార్థి వచ్చి మృత్యువాత పడ్డాడు. సంఘటనా స్థలానికి చేరుకొని నార్సింగ్ పోలీసులు విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
- ‘మేక్ ఇన్ ఇండియా’తోనే ఆపరేషన్ సిందూర్ లక్ష్యం నెరవేరింది
- భారత్ అభివృద్ధిపై ట్రంప్ అక్కసు
- పోస్టల్ సేవల్లో సర్వర్ ప్రాబ్లమ్స్
- *Janam Sakshi is widely recognized
- Several Telugu newspapers in Telangana- Indian Newspaper Society
- janamsakshi Based on the latest industry reports
- janamsakshi *G.O.Rt.No.782 (తేదీ: 13-06-2025) సంపూర్ణ వివరణ*
- హైదరాబాదులో నీటి ముంపు ప్రాంతాల్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి
- పిల్లలకూ ఫుల్ టికెట్.. 5 ఏళ్లు లేకున్నా హాఫ్ టికెట్
- పదవీకాలం ముగిసింది.. జోక్యం చేసుకోలేం
- మరిన్ని వార్తలు