2వ రోజు కొనసాగుతున్న వీఆర్ఏల నిరవధిక సమ్మె

ములుగు జిల్లా బ్యూరో,జులై 26 (జనంసాక్షి):-
తెలంగాణ రాష్ట్ర విఆర్ఏ జేఏసీ నిర్ణయం మేరకు ములుగు జిల్లా కేంద్రంలోని వెంకటాపూర్ మండలంలో రెండవ రోజు నిరవధిక సమ్మె చేయడం జరిగినది.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించినటువంటి పే స్కేలు జీవోను మరియు అర్హులైన వీఆర్ఏలకు ప్రమోషన్స్ మరియు 55 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏ రిటైర్మెంట్ బెనిఫిట్ ఇచ్చి వారి వారసులకు ఉద్యోగాలు ఇస్తానని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇవ్వడం జరిగింది. ఇట్టి హామీని నెరవేర్చేదాక మేము సమ్మె చేస్తామని ఈ సందర్భంగా తెలియజేయడమైనది. ఇట్టి నిరవధిక సమ్మెలో ములుగు జిల్లా ఉపాధ్యక్షులు కాసర్ల రాజయ్య, వెంకటాపూర్ మండల అధ్యక్షులు నక్క శశి కుమార్,మండల ఉపాధ్యక్షులు తొగరి మురళి, మండల ప్రధాన కార్యదర్శి మంతెన స్వప్న మరియు గాజుల కృష్ణ ప్రసాద్,పొనుగంటి శంకర్, అలుగోజు శ్రీకాంత్,రడపు సరిత, కుమారస్వామి మరియు మండల విఆర్ఏలు పాల్గొనడం జరిగింది .
Attachments area