20 స్థానాల్లో బీఎస్పీ తొలిజాబితా

` ప్రకటించిన అన్ని స్థానాల్లో గెలుస్తాం
` బీసీలకు 60`70 స్థానాలు కేటాయిస్తాం
` బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌ కుమార్‌
` వచ్చే ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగానే పోటీ : ఎంపీ రాంజీ గౌతమ్‌
హైదరాబాద్‌ బ్యూరో (జనంసాక్షి):ప్రజాబలంతో వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలుస్తామని బహుజన్‌ సమాజ్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్‌.ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు. మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీఎస్పీ అధినేత్రి కుమారి మాయావతి అనుమతితో బహుజన్‌ సమాజ్‌ పార్టీ నేషనల్‌ కో`ఆర్డినేటర్‌, రాజ్యసభ సభ్యులు రాంజీ గౌతమ్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌ కుమార్‌ 2023 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బీఅర్‌ఎస్‌, బిజేపి,కాంగ్రెస్‌ పార్టీలు ఆచరణ కానీ అబద్ధపు హావిూలతో మోసపూరిత మేనిఫెస్టోలను ప్రజలేవరు నమ్మొద్దన్నారు. బిజేపి, బీఅర్‌ఎస్‌,కాంగ్రెస్‌ పార్టీలకు ఉన్నది ధనబలం కానీ, బీఎస్పీకి ఉన్నది మాత్రం ప్రజా బలమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో లబ్ది కోసమే తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ పసుపు బోర్డు,గిరిజన యూనివర్సటీ ప్రకటనలు చేశారని విమర్శించారు.రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఉన్న విభజన హావిూలు నెరవేర్చడంలో ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ విఫలమయ్యారన్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ,కాజిపేట్‌ రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ,పాలమూరు`రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయహోదా ఎందుకు ఇవ్వలేదని అన్నారు. ఐటీఐఅర్‌ ప్రాజెక్ట్‌ రద్దు ,కొత్త ఐఐటీ,ఐఐఐటీ, ఐఐఎంలు ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. అధికారం అట్టిపెట్టుకోవాలని సమగ్ర కుటుంబ సర్వేను కేసీఆర్‌ బయట పెట్టడం లేదని విమర్శించారు. ప్రజల సొమ్ముతో చేసిన సర్వేను రహస్యంగా ఉంచడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు? ప్రజల సొమ్మును కేసీఆర్‌ స్వార్థానికి వాడుకుంటున్నారు. టీఎస్పీఎస్సీ పేపర్‌ లీకేజీ కి సూత్రధారులు కేసీఆర్‌, కేటిఆర్‌ లేనని ఆరోపించారు.టీఎస్పీఎస్సీ బోర్డు రద్దు చేయలని అక్టోబర్‌ 14 న నిరుద్యోగులు తలపెట్టిన సడక్‌ బంద్‌ కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.డీఎస్సీలో 13,086 పోస్టులు పెంచి భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఉద్యోగులను మరోసారి మోసం చేసేందుకు పీఅర్సీ ప్రకటన చేశారని ఆరోపించారు. ఈ సమావేశంలో పార్టీ కోఆర్డినేటర్‌ మంద ప్రభాకర్‌, పార్టీ రాష్ట్ర నాయకులు, ఎమ్మెల్యే అభ్యర్థులు పాల్గొన్నారు
తొలి జాబితా విడుదల
1. సిర్పూర్‌ (జనరల్‌) ` డా.అర్‌. ఎస్‌.ప్రవీణ్‌ కుమార్‌
2. జహీరాబాద్‌ (ఎస్సీ) ` జంగం గోపీ
3. పెద్దపల్లి (జనరల్‌) ` దాసరి ఉష
4. తాండూరు (జనరల్‌) ` చంద్రశేఖర్‌ ముదిరాజ్‌
5. దేవరకొండ (ఎస్టీ)` డా.ముడావత్‌ వెంకటేష్‌ చౌహాన్‌
6. చొప్పదండి (ఎస్సీ) ` కొంకటి శేఖర్‌
7. పాలేరు (జనరల్‌) ` అల్లిక వెంకటేశ్వర్‌ రావు
8. నకిరేకల్‌ (ఎస్సీ) ` మేడి ప్రియదర్శిని
9. వైరా (ఎస్టీ)` బానోత్‌ రాంబాబు నాయక్‌
10. ధర్మపురి (ఎస్సీ) ` నక్క విజయ్‌ కుమార్‌
11. వనపర్తి (జనరల్‌) ` నాగమోని చెన్న రాములు
12. మనకొండూరు (ఎస్సీ) ` నిషాని రామచందర్‌
13. కోదాడ (జనరల్‌) ` పిల్లిట్ల శ్రీనివాస్‌
14. నాగర్‌ కర్నూల్‌ (జనరల్‌)` కొత్తపల్లి కుమార్‌
15. ఖానాపూర్‌ (ఎస్టీ)` ` బాన్సీలాల్‌ రాథోడ్‌
16. అందోల్‌ (ఎస్సీ) ` ముప్పారపు ప్రకాష్‌
17. సూర్యాపేట (జనరల్‌) ` వట్టే జానయ్య యాదవ్‌
18. వికారాబాద్‌ (ఎస్సీ) ` గోర్లకాడి క్రాంతి కుమార్‌
19. కొత్తగూడెం (జనరల్‌) ` ఎర్ర కామేష్‌
20. జుక్కల్‌ (ఎస్సీ) ` ప్రధ్న్యకుమార్‌ మాధవరావు